Monday, 10 January 2011

'సీమాంధ్ర' బాబు - 'సీమాంధ్ర' జగన్ - 'సదరు' తెలంగాణా నాయకుడు

తెలుగు మిత్రులారా, గత కొన్నిరోజులుగా 'ఆంధ్రప్రదేశ్' రాష్ట్రంలో మన 'బాబు' - మన 'జగన్' రైతులపై ఎనలేని అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు.

సదరు మొదటి వ్యక్తి, తెలంగాణా - సీమాంధ్ర సమస్య, డిసెంబర్ గడువు గుర్తెరిగి, ఎప్పుడో మొదటి వారంలో కురిసిన అకాల వర్షాలకు, సరిగ్గా పక్షం రోజులు సమయం తీసుకోని, తెలంగాణా సమస్యని 'హైజాక్' చేయాలనే కుట్రతో, 17 డిసెంబర్ నుండి ఒక వారం 'తూతూ' మంత్రంగ దీక్ష కూర్చొన్నారు. తన తొమ్మిది సంవత్సరాల పాలనలో ఒక్క 'IT' జపం చేస్తూ 'ఈ రైతులను పట్టించుకోకుండా, వారి చలో అసెంబ్లీ కార్యక్రమంలో 'నవ దయ్యరై' తుపాకులు ఎక్కుపెట్టాడు.

ఇక రెండవ వ్యక్తి, తండ్రిగారి ఐదు సంవత్సరాల పాలనలో, MPగ వుంటూ, గతమేన్నడు లేని విధంగా అత్యధికంగా సంపాదించి, 'అత్యదికంగా పన్ను' చెల్లించి, అప్పుదేప్పుడు గుర్తుకురాని 'రైతన్న' సమస్యని ఆలస్యంగానైన, మన తెలంగాణా విషయాన్నీ దారిమల్లించడానికి, 2 రోజుల దీక్ష, ఇప్పుడు ఢిల్లీ ప్రయాణంతో 'తన' ఉనికిని చాటుతున్నాడు.

గత దశ్బ్తలుగా తెలంగాణా గురించి విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, రైతులు మొదలు సామాన్య ప్రజలు వుద్యమిస్తుంటే, ఎన్నికల సమయంలో వారివారి వోట్ల కోసం 'తెలంగాణా' అనుకూలమని ఇటు 'తెలంగాణా ప్రజలను' అటు 'సీమాంధ్ర ప్రజలను' మోసంచేస్తు ఎన్నడో మరచిన 'రైతన్న' సమస్యని తీరా వీరి అభిప్రాయం చెప్పమనేసరికి తప్పించుకు తిరుగుతూ రెండు ప్రాంతాల కాదు, మూడు ప్రాంతాల ప్రజలని ఇంకా నిలువునా మోసం చేస్తున్నారు.

ఏమైనా వీరిని వారిని అని ఏమిలాభం, 'మన బంగారం మంచిది కాకపోతే' అదే మన తెలంగాణా కాంగ్రెస్ తెలుగు దేశం రాజకీయ నాయకులూ, వాళ్ళని నడిరోడ్డు మీద నిలబెట్టి కడిగెయ్యాలి కాదు ఉతికి ఆరెయ్యాలి.

'సీమాంధ్ర' స్నేహితులారా ఇప్పుడు 'శ్రీ కృషునుడి' నీవేదికలో రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడినదని చెబుతుంటే, పైన చెప్పిన వారి వారి కుటుంబాలు వచ్చిన ప్రాంతానికి వారు ఏమి చేసారని 'ఏ ఒక్క రాయలసీమ' లేదా 'ఆంధ్ర' తెలుగు స్నేహితులు ప్రశ్నించారా? లేదే. కాని తెలంగాణా విడిపోయిన పరవాలేదు కానీ 'హైదరాబాద్' మాత్రం కావలె అని మూర్కంగా వితండ వాదం చేస్తారు. మొదలు నివేదిక చదివి 'మీ మీ నాయకుల్ని' నిలబెట్టి ప్రశ్నించండి. ఇప్పటికైనా విడిపోతే, వాడు మోసం చేసాడు, వీడు దగా చేసాడు అనే కుంటి సాకులు వుండవు.

ఇప్పటికైనా మేల్కొనండి ఈ దగా రాజకీయ నాయకులని పట్టుకోవాలంటే 'సముద్రంలాంటి పెద్ద రాష్ట్రాల్ల్లో' కష్టం. చిన్న రాష్ట్రం, చిన్న కేబినేట్, చిన్న బడ్జెట్, కళ్ళముందు కనపడే పారదర్శక పరిపాలనతో మాత్రమే సాధ్యం. ఈ విధంగానైన ఒక్క 'హైదరాబాద్' కాకుండా మరిన్ని 'హైదరాబాద్'లు ఏర్పడతాయి. అవి గ్రామాలతో, అక్కడి రైతులతో, ప్రజలతో కలసిపోతాయి. అప్పుడు మాత్రమె 'పట్టణ వలసలు' అంతరించి పోతాయి.

ఇది ఒక తెలంగాణా తెలుగోడి ఉక్రోశ.

మీ చిన్న

Thursday, 6 January 2011

శ్రీ కృష్ణ తాండవీయం

ఇది నిజంగా శ్రీ కృష్ణుడి (జుస్టిస్ శ్రీ కృష్ణ కంమిస్సిఒన్) తెలంగాణావాదుల మీద వికృత తాండవీయం. మొదటినుండి మనమందరం ఊహించిన అంశాల సమాహారం. దీనికోసం దేశ ప్రజాధనం రు. 20 కోట్లు వృధా. ఏదో సామెత చెప్పినట్టు "కొండంత రాగం తీసి పిచ్చకుంట్ల పాట పడినట్లుంది".

ఏది ఏమిన ఇందులో ఒకటి నిక్కచిగా చెప్పినట్టు, వైద్య విద్య ఆర్ధిక రాజకీయ అణచివేత జరిగింది అనే మన తెలంగాణావాదుల ముక్తకంటాన్నితన "మురళి గానంతో" వినిపించాడు ఈ "వృద్ధ కృష్ణుడు".

ఒక్కటి మాత్రం నిజం, ఆంధ్ర ప్రాంత ప్రజల "తెలంగాణా" వివక్ష ఎంత నిగూడంగా వుందో ఉదాహరణ ఏంటంటే, నా కోస్త ఆంధ్ర స్నేహితుడి భార్య ఎప్పుడు కూడా మమల్ని "తెలంగాణా వాళ్ళు" అని సంబోదిస్తూ వుంటుంది. నేను చాలా సార్లు తనని అడిగినప్పుడు అవును మీది ఆ ప్రాంతమే కదా అని తనని సమర్దిస్తూ వుంటుంది. ఇది నిజంగా వివక్షత కాదా. ఇలా ఒక NRI ప్రవర్తిస్తూవుంటే, సగటు సీమంధ్ర ప్రజలు, అధికారులు, రాజకీయ నాయకులూ మన తెలంగాణా ప్రజలని ఏ విధంగా వివక్షిస్తారో ఊహించుకోవచ్చు.

అందుకే "ప్రత్యెక తెలంగాణ" రాష్ట్ర ఏర్పాటు తధ్యం అనేది నివురు కట్టిన నిప్పులా తప్పక బయటికి వచ్చి తీరుతుంది.

మీ కోసం ఈ "శ్రీ కృష్ణుడి వికృత తాండవీయం" - నివేదికని ఇక్కడ ఉంచుతున్నాం.

రిపోర్ట్ - 1

http://pib.nic.in/archieve/others/2011/jan/d2011010502.pdf

రిపోర్ట్ - 2

http://pib.nic.in/archieve/others/2011/jan/d2011010503.pdf

మీ

చిన్న (ఒక తెలంగానీయుడి ఉక్రోశ)

Sunday, 17 January 2010

తెలంగాణా పై ఇందిరా గాంధీ - ఈశ్వరీ బాయి ఉపన్యాసం

1974 ఫిబ్రవరి 5వ తేదీన శాసన సభలో జరిగిన చర్చలో జె. ఈశ్వరీబాయి ప్రసంగం
Dec 31
ఉద్యమాల ద్వారా పదవులు వచ్చాయి తెలంగాణకు ఏమి ఒరిగింది ?
December 31, 2009 | Tagged telangana, women, ఉద్యమం, తెలంగాణ, ప్రజల, రాష్ట్రం | Leave a ఆరు సూత్రాల పథకంపై
1974 ఫిబ్రవరి 5వ తేదీన శాసన సభలో జరిగిన చర్చలో
జె. ఈశ్వరీబాయి ప్రసంగం

సభ ముందున్న కార్యక్రమం మనముందు ఎవరు పెట్టారో తెలియదు. ముఖ్యమంత్రిగారు పెట్టారో, మరొకరు పెట్టారో తెలియదుగాని పేరు లేకుండా ఇక్కడకు వచ్చింది. ఇది వరలో అష్ట సూత్ర పథకాలు, పంచ సూత్ర పథకాలు వచ్చాయి. వాటికి పట్టిన గతే ఈ ఆరు సూత్రాల పథకాలకు కూడా పడుతుంది. గవర్నరుగారి ప్రసంగ సందర్భంలో ఈ ఆరు సూత్రాల పథకాన్ని ఇక్కడ నేను తగలబెట్టిన సంగతి అందరికీ తెలిసినదే.ఇక్కడ ఏమని రాశారంటే, ఇక్కడ నాయకులతో అనేక సార్లు చర్చించామని, వారిలో వారు కూడా చర్చించుకున్నారని ఉంది. ఎవరు ఎవరితో చర్చించారో మాకు తెలియదు. ఈ రాజ్యం కాంగ్రెస్ వాళ్ళ అబ్బ సొమ్మా అని అడుగుతున్నాను. కాంగ్రెస్ పార్లమెంటు మెంబర్లు, శాసన సభ్యులతో మాట్లాడితే సరిపోయిందా అని అడుగుతున్నాను. ఆంధ్ర, తెలంగాణ ప్రశ్న వచ్చినప్పుడు తెలంగాణ వారు ఎప్పుడూ ఆంధ్రతో కలియడానికి సిద్ధంగా లేరు.

రాయలసీమ వారు కూడా కలియడానికి ఇష్టం లేకపోతే శ్రీబాగ్ ఒప్పందం అని పెట్టి వారిని కలుపుకున్నారు. ఇక్కడ కూడా ప్రజలకు కలవడానికి ఇష్టం లేకపోయినా వెంకటరెడ్డిగారు కొన్ని షరతులపై కలుస్తామని ఒప్పుకున్నారు. వాటిని మేము కూడా ఒప్పుకుం టాము అన్న తర్వాతనే ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. నాయకుల మధ్య జరిగిన ఒప్పందం పెద్ద మనుషుల ఒప్పం దం అయినది. ఆ విధంగా పదమూడు సంవత్సరాలు నడిచింది. మంత్రి పదవులు కావాలి అనుకున్నవారికి దొరికాయి. శాసన సభ్యులు కాదలచుకున్నవారు అయినారు. వారు ఇక్కడ డబ్బు సంపాదించుకున్నారు. బ్లాక్ మార్కెట్టు కోసం పైరవి చేసుకున్నారు. మంత్రులు చాలా సుఖంగా ఉండిపోయినారు. తెలంగాణ వారి బాధలను మరిచిపోయినారు.

పదమూడు సంవత్సరాలైన తర్వాత ఉద్యమం లేవతీసినారంటే, నాయకులు లేవతీయలేదు. విద్యార్థులు లేవతీసినారు. ఉద్యోగులు లేవతీసినారు. క్లాస్ 4 ఉద్యోగులు లేవదీసినారు. టీచర్లు లేవతీసినారు.వారంతా లేవతీసిన తర్వాతనే ఇక్కడ లీడర్లు దానిలో పూనుకున్నారు. కాంగ్రెస్ నుంచి కొంతమంది లీడర్లు వచ్చి పవిత్రమైన మూవ్మెంట్ను స్టాప్ చేసి ఆరు సూత్రాలు, 7సూత్రాలు, 8 సూత్రాలు అనుకొని వెళ్లిపోయారు.

కేంద్రం కూడా విఫలం అయినది. చవాన్ను పంపించి స్పాట్ ఎంక్వయిరీ చేయమన్నారు. 69లో ఒకనాడు ఇందిరాగాంధీ గారు ఏ రాత్రి వచ్చారో వెళ్లిపోయారు. 1972 ఎలక్షన్స్ మ్యానిఫెస్టోలో కూడా తెలంగాణా గురించి న్యాయం చేస్తామని ప్రామిస్ చేశారు. ఫెయిర్ డీల్ టు ది తెలంగాణ అని వరంగల్లులో ఇందిరాగాంధీ గారు స్వయంగా తెలంగాణ ప్రజలకు చెప్పారు. కానీ ఎలక్షన్ కాగానే తెలంగాణను మర్చిపోయారు.ఆంధ్రలో పెద్ద ఉద్యమం లేవదీసినారు. వెంగళరావుగారు ముఖ్యమంత్రి అయితే గొప్ప గొప్ప మాటలు చెప్పిన వారే, అమాయకులైన బిడ్డల ప్రాణాలు తీయించిన వారే మంత్రులు అయినారు. ప్రత్యేక ఆంధ్ర కావాలన్న వారు ఈనాడు మినిష్టర్లు అయినారు. ఇది వరకు ప్రత్యేక తెలంగాణ కావాలనిన వారు మంత్రులు అయినట్లే, ఆంధ్ర కావాలని అనినవారు మంత్రులు అయినారు.

సెపరేషన్ మంచిది. పంజాబ్, హర్యానా చిన్న రాష్ట్రాలుగా అయిన తర్వాత చాలా అభివృద్ధి అయినవి.సముద్రం లాంటి పెద్ద స్టేట్తో కలిసి ఉండటం వల్ల తెలంగాణ అభివృద్ధి కాదు. తెలంగాణ వెనుకబడి ఉంది.మాకు సెపరేటు స్టేట్ కావాలని మేము అంటున్నాం. ఆరు సూత్రాల పథకం మూలంగా తెలంగాణ రీజియనల్ కమిటీ ఖతం అయినది. ముల్కీ రూల్సు ఖతం అయినవి. తెలంగాణ వారి గతి ఏమయినది? తెలంగాణ వారు అనాథలు అయినారు. ఎవరికి చెప్పుకోవాలి? ఏమి చెప్పుకోవాలి?

Sunday, 10 January 2010

Hope for future

Minds are divided now, still the poor soul of the ultimate victim (conman man) continues to suffer.

Now all 3 sides/regions read into any thing in their own way that comforts them, that pleasures their angered passionate minds to some degree at least.

We people with computer access usually not influence any opinion building or opinion shifting in real ground.

All these mails are totally void and zero value in real effect. Such a WASTE of energy emtional and physical.

Still I write...... :(
The politicians fooled Telanganites by promising that they never wanted to happen.

Same politicians fooled Andhraits by convincing them that their promise to Telangana was all fake and will never happen.

Now the agitations to forcefully mend decisions are separating hearts and minds.

For andhraits, some people worry about losing Hyderabad or some concerned about losing their businesses and power at large, few good souls weep about telugu family dividing.

For telangana's mounting lava of humiliation as their almost realised dream is being forcefully snatched away by the very people who said they understood their concerns and now the same people argue telangana's concerns hold no value for them.

From kashmir to assam to srilanka majority forces opinion on minority... results in long term unrest and sufferring to all, humiliation and pain results in further anger. This prolongs and takes Nations back.

Argument brings hatred, now telangana or andhra needs love to be able to hug each other and restart looking at each other with kind heart and concern for each other.

Suppression of desires, aspirations , ideologies is not way forward, dialogue and cooperation promise of hope and betterment is what needed in any form either in the form of 3 or 2 seperate great states or in the form of ideas like regional development centres for each region or the Great Andhra Pradesh. After all states are administrative units meant for facility of administration.

If telangana happens telanganietes need to offer positive contribution back in building new andhra state in every form rightfully they deserve.

If Andhraiets want to stop Telangana, they need to offer hope and a solid action plan to address concerns along with other poorer areas in all other regions too.

A progressive and multi cultural thriving nation is what in making and I believe India survives through all these challenges not only in Andhra Pradesh, all over India as she did many times earlier. I hope to see a great nation of entrepreneurs,scientists, great thinkers prosper and flourish in all classes regions and ther esteemed values of a greatest civilisation that we all share prevail.

As one of the friend had in his mail, the aspiration is to Love Ever and Hate Never if possible :)

To me ideas shared by JP provide hope... http://www.youtube.com/watch?v=fBa9RxfanDo !

At the end of video JP suggests few immediate actions like regional development centres and district development councils.

After all there are only 2 classes in the world, who is sitting in comfort of good life and the other who is not sure of his destiny and food in plate.

Friday, 25 December 2009

తెలంగాణ - సమగ్ర చర్చలేదా ఏకాభిప్రాయం?

తెలంగాణ - విద్యార్థుల నెత్తురోడ్డుతూ ఇప్పుడొక రాజకీయ రణరంగ వేదికగ మారింది. కానీ ఇలా జరగడానికి కారణం ఎవరు?

తెలంగాణ చరిత్ర గురించి ఇంతకూ ముందు బ్లాగ్ శీర్షికలో చెప్పుకోవడం జరిగింది. కానీ దీనిని చదివి కూడా సాటి తెలుగు సోదరులు/సోదరినులు ఇంకా తమ ప్రాంత(స్వ) అభిప్రాయాలని తెలంగాణాకి ఆపాదిస్తూ సగటు సీమాంధ్ర రాజకీయనాయకులాలా మాట్లుడుచున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి ఈ మధ్యన మన కేంద్ర ప్రభుత్వం ప్రకటన చూదండి.

Sri Chidambaram - Home Minister of India (Statement on 23 Dec 2009)
On formation of Telangana state there is a need to molde wide ranging consultation with wide political parties and groups in the state.of A.P. Govt of India will take steps to involve all concerns in the process.

దాని ఫై నా లాంటి సగటు తెలంగాణ తెలుగు పౌరులు తెలంగాణ ఏర్పాటు ఫై అభిప్రాయ సేకరణకానీ, సమగ్ర చర్చైనా కానీ, మరీ ఏ విధమిన చర్చకు గురించి పట్టుపట్టే వారిని క్రింది ప్రశ్నలకు జవాబులని ఆత్మసాక్షిగా చెప్పమనండి?

1. మద్రాస్ స్టేట్ నుండి ఆంధ్ర రాష్ట్ర విభజన మరియు ఏర్పాటు గురించి సాటి భారతీయులైన తమిళుల అభిప్రాయ సేకరణ జరిగిందా? మరీ అప్పుడు అడగని అభిప్రాయం ఇప్పుడెందుకు?
2. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటులో అప్పటి హైదరాబాద్ స్టేట్ (తెలంగాణ ప్రాంత) విలీనంఫై ఆ ప్రాంత ప్రజల అభిప్రాయ సేకరణ జరిగిందా? State Re-organisation commision అభిప్రాయాన్ని మించి ఎవరి అభిప్రాయాన్ని పరిగణనలో తీసుకోవడం జరిగింది. (ఆంధ్ర రాజకీయనయకులదా?)
౩. అప్పటి ఆంధ్ర రాష్ట్ర రాజధాని కర్నూల్ని (టెంట్లలో అసెంబ్లీ, సేక్రాటరైట్, హై కోర్ట్) నుండి ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటులో హైదరాబాద్ ని రాజధానిగ మార్చడంలో ఆ ప్రాంత అభిప్రాయసేకరణ/చర్చ జరిగినదా?
4 శ్రీ పొట్టి శ్రీరాములు గారి ఆమరణ నిరాహార దీక్ష ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుని వక్రీకరించి చెబుతున్న మన నాయకులకి సూటిగా ప్రశ్నిస్తే వారి త్యాగం ఫలితం మీకు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు నుండి తెలంగాణ ఆక్రమణకి దోహదపదిండా?

మన భారతదేశ చరిత్రలో ఎప్పుడైనా ఒక రాష్ట్ర ఏర్పాటులో ఇంతటి వివక్షని ఏ కేంద్ర ప్రభుత్వం ప్రదర్శించలేదు? మరి తెలంగాణ ఫై, తెలంగాణ ప్రాంత ప్రజలపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రబుత్వం ఎందుకింత సవతి ప్రేమ ప్రదర్శిస్తుంది? ఏ రాజకీయ లాభాపేక్షతో ఈ సందిగ్ధ వాతావరణానికి కారణభూతమైంది? ఇరు ప్రాంత విద్యార్ధుల, ప్రజల ప్రాణహానికి కారణమైంది ఏ ఉద్దేశ్యంతో?

ప్రస్తుత పరిస్థితి తెలంగాణ ప్రజల మాటల్లో వింటే "ఇంటివాడు తనింటికి వస్తే దొంగోడికి కోపం వచిన్దన్నట్టు? సీమాంద్ర రాజకీయనాయకుల తెలంగాణ ప్రాంత ప్రజలపై ఈ దోపిడీ ఆక్రమణ ఇకనైనా ఆగాలంటే తెలంగాణ రాష్ట్ర అవిర్భావమొక్కటే పరిష్కారం. దీనిపై ఎటువంటి ప్రజాభిప్రాయం, రాజకీయ చర్చ అవసరం లేదు. ఒకవేళ చర్చ జరగాల్సి వస్తే అది ఇప్పటి వరకు తెలంగాణ దోపిడీకి కారణమైన "పెద్ద మనష్యులపై" మాత్రమే.

ఇది ఒక సాటి తెలుగు అంతరాత్మ గోష